Monday, May 6, 2024

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: తెలంగాణ ఆవిర్భావం ఒక చారిత్రాత్మక ఘట్టమని, ప్రజలంతా ముక్తకంఠంతో కోరి సాధించుకున్న ఒక అపురూప విజయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ విజయం కోసం ఎంతోమంది ప్రాణాలు ధారబోశారని, మరెందరో తమ జీవితాలను అర్పించారని, వారి త్యాగాల ఫలమే నేటి మన తెలంగాణ రాష్ట్రమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిది వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా తన పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర సాధనలో అసువులు బాసిన వీరులకు వందనాలు తెలుపుతున్నానన్నారు. ఉద్యమాలకు పురిటిగడ్డ తెలంగాణ అని, పాలకుల అణిచివేత, దాష్టీకాలను ఎదిరించే లక్షణం ఈ నేల సొంతమని, ఈ లక్షణం దేశంలోని ప్రజలందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. పోరాడితేనే లక్ష్యం సిద్ధిస్తుందని ఎలుగెత్తి చాటింది తెలంగాణ ఉద్యమమని కొనియాడారు. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఏ లక్ష్యంతో తెలంగాణ కోరుకున్నారో ఆ లక్ష్యం సంపూర్ణంగా సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement