Monday, April 29, 2024

శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్

ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్యులు సహస్రాబ్ది ఉత్సవాలకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సమతామూరి విగ్రహాన్ని సందర్శించారు. విగ్రహం చుట్టూ నిర్మించిన 108 దివ్యక్షేత్రాలను దర్శించి పూజలు చేశారు. చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు కూడా అందుకున్నారు. తమ ఆశ్రమానికి వచ్చిన పవన్ కల్యాణ్ కు చిన్నజీయర్ స్వామి శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు ఆశ్రమ విశేషాలను, సహస్రాబ్ది ఉత్సవ వివరాలను తెలిపారు. అనంతరం పవన్ ప్రసంగిస్తూ.. సమానత్వంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

కాగా, పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వచ్చారు. పవన్ రాకతో ఆశ్రమంలోనూ కోలాహలం నెలకొంది. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement