Monday, May 6, 2024

పోలవరం నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ?

పోలవరం నిర్వాసితులను పునరావాసం కల్పించాకే తరలించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. జేసీబీలతో ఇళ్లను కూల్చి సదుపాయాలు నిలిపివేయడం దారుణమన్నారు. మానవ హక్కులను ఉల్లంఘిస్తూ నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించడం గర్హనీయమని మండిపడ్డారు. నిర్వాసిత కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు లేవన్నారు. ప్రభుత్వ వైఖరిని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.నిర్వాసితుల పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరి బాధ కలిగిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులపై ప్రభుత్వ తీరు మానవ హక్కుల ఉల్లంఘనేనని పవన్ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement