Friday, April 26, 2024

పాకిస్థాన్ లో ప‌ఠాన్.. హౌస్ ఫుల్ గా థియేట‌ర్లు

ఇండియా చిత్రాల‌పై పాకిస్థాన్ లో నిషేధం ఉంది. అయినా స‌రే ప‌ఠాన్ చిత్రాన్ని పాకిస్థాన్ లో అక్ర‌మంగా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దాయాది దేశంలో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లు హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయి. టికెట్ రేటు పాకిస్థాన్ కరెన్సీలో రూ.900గా నిర్ణయించినప్పటికీ, జనాలు పోటెత్తుతున్నారట. పఠాన్ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండడం పాక్ లోనూ హీరో షారుక్ ఖాన్ కి ఉన్న క్రేజ్ కు నిదర్శనం అని చెప్పాలి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే నటించిన పఠాన్ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రం ఇప్పటిదాకా రూ.700 కోట్లకు పైగా రాబట్టి, రూ.1000 కోట్ల మార్కు దిశగా దూసుకెళుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement