Sunday, April 28, 2024

Tamil Nadu: ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న కుమార్తెను స‌జీవద‌హ‌నం చేసిన త‌ల్లిదండ్రులు..

తంజావూరు – ప్రేమించి పెళ్లిచేసుకున్న కుమార్తెను ఇంటికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తల్లిదండ్రులు హత్య చేసిన దారుణ సంఘటన త‌మిళ‌నాడులోని తంజావూరులో జ‌రిగింది… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐశ్వర్య (19) నవీన్ (19) నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకుని విడిగా ఉంటున్నారు. కొద్ది రోజుల తర్వాత ఐశ్వర్య తల్లిదండ్రులు వారి వద్దకు వచ్చి త‌మ‌ ఐశ్వర్యను రెండు రోజులు మా ఇంటికి తీసుకెళ్లి పంపిస్తామని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత రెండు రోజులకు నవీన్ ఐశ్వర్యకు కాల్ చేయగా ఫోన్ ఆఫ్ వచ్చింది.

రెండు రోజులు గడిచిపోయినా వారు తన భార్యను పంపకపోవడంతో నవీన్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఐశ్వర్య ఇంటికి వెళ్లి విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన కూతురు వేరే కులస్తుడైనా నవీన్ ని పెళ్లి చేసుకుందనే కోపంతో పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐశ్వర్య తల్లిదండ్రులైన పెరుమాళ్లు, రోజాలను అరెస్ట్ చేశారు.. కేసు న‌మోదు చేసుకుని విచారిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement