Monday, April 29, 2024

టాస్ గెలిచిన పంత్.. ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

చెన్నై సూపర్ కింగ్స్‌తో తల పడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైంది. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీనిలో టాస్ గెలిచిన ఢిల్లీ సారధి రిషభ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అలాగే తమ జట్టులో రెండు మార్పులు ఉన్నట్లు వెల్లడించాడు. అక్షర్ పటేల్ ఫిట్‌గా ఉన్నాడని, లలిత్ యాదవ్ స్థానంలో అతను ఆడుతున్నాడని తెలిపాడు.

అలాగే మన్‌దీప్ సింగ్ స్థానంలో కేఎస్ భరత్ ఆడుతున్నాడని చెప్పాడు. చెన్నై జట్టులో కూడా ఒక మార్పు చోటుచేసుకుంది. ఫిట్‌నెస్ సమస్య కారణంగా జడేజా ఈ మ్యాచ్ ఆడటం లేదని ధోనీ వెల్లడించాడు. అతని స్థానంలో దూబే ఆడతాడని చెప్పాడు.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, మొయీన్ అలీ, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డ్వేన్ ప్రిటోరియస్, సిమర్‌జీత్ సింగ్, మహీష్ తీక్షణ, ముకేష్ చౌదరి

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, కేఎస్ భరత్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మెన్ పావెల్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఆన్రిచ్ నోర్ట్‌జీ, ఖలీల్ అహ్మద్

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement