Tuesday, May 7, 2024

పంత్‌కు ఐపిఎల్‌ చాన్స్‌ లేదు

భారత స్టార్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ వచ్చే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కి అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించారు. రిషబ్‌ డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెగా టోర్నీలో ఆడబోవడం లేదని గంగూలీ పేర్కొన్నారు.

గంగూలీ త్వరలో ఢిల్లి క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీకి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అలాగే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ 20 టీం దుబాయ్‌ క్యాపిటల్స్‌ , ఎస్‌ ఏ టీ 20 టీం ప్రిటోరియా క్యాపిటల్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఢిల్లి క్యాపిటల్స్‌ జట్టుకు రిషబ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement