Wednesday, May 1, 2024

Pakaistan – ఆర్మీ బేస్ క్యాంప్ పై ఆత్మ‌హుతి దాడి.. 23 మంది దుర్మ‌ర‌ణం

ఇస్లామాబాద్ – పాకిస్తాన్‌లో భారీ ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ బేస్ వద్ద మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 23 మంది మరణించారు. మ‌రో 27 మందికి పైగా గాయ‌ప‌డ్డారు.. ఈ దాడిని పాకిస్తాన్ తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు జరిపినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని సైనిక స్థావరంపై తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. అయితే దాడి జరిగిన సమయంలో సైనికులతో పాటు ఇతరులు నిద్రలో ఉన్నారు.. మరణించిన వారిలో చాలా మంది సివిల్ డ్రెస్సుల్లో ఉన్నారు.

ఓ పాఠశాల భవనాన్ని తాత్కాలిక సైనిక స్థావరంగా మార్చుకున్నారు. ఈ భవనం వద్దే ఆత్మాహుతి వాహనం పేలింది. మరో 27 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి భవనం కూలిపోయింది. మృతదేహాలను శిథిలాల కింద నుంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భ‌య‌ప‌డుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement