Thursday, April 25, 2024

వామ్మో.. ఒకే రేషన్ కార్డులో 68 మంది సభ్యులు

సాధారణంగా ఒక రేషన్ కార్డులో 4-10 మంది కుటుంబసభ్యులు ఉంటారు. కానీ ఒక కుటుంబంలో ఏకంగా 68 మంది సభ్యులతో కూడిన రేషన్‌ కార్డు ఉండటం, వారిలో హిందువులు, ముస్లింలు కూడా ఉండటం కలకలం రేపింది. బీహార్‌లోని మహువా ఎస్డీఓ సందీప్‌ కుమార్‌ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. వైశాలి జిల్లాలో ఆహార ధాన్యాల పంపిణీ వివరాలను పరిశీలిస్తుండగా, ఒకే కుటుంబానికి ఏకంగా 38 క్వింటాళ్ల ధాన్యం ఇచ్చినట్లు కనిపించడంతో అధికారులు అవాక్కయ్యారు. స్థానిక రేషన్‌ డీలర్‌ సంజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. లబ్దిదారుల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసే పనిలో పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement