Friday, May 10, 2024

అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కారు మరో అవకాశం

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు దరఖాస్తు నమోదు గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. రూ.20వేల లోపు డిపాజిట్ దారుల వివరాలు సరి చూసేందుకు మరో అవకాశం ఇచ్చింది. వాలంటీర్ల దగ్గర రసీదులతో వివరాలు నమోదు చేయాలన్న ప్రభుత్వం.. ఎంపీడీవో కార్యాలయాల్లో రసీదులు ఇవ్వొచ్చని సూచించింది.

కాగా ఈ నెల 24న రూ.20వేల లోపు డిపాజిట్లు చేసిన వారి అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. ఈ నెల 6న మొదలైన వివరాల నమోదు ప్రక్రియ ఆగస్టు 19వ తేదీ వరకు కొనసాగుతుంది. రూ.20వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు agrigolddata.in వెబ్‌సైట్‌లో ఆధార్ నమోదుతో పూర్తి వివరాలను చూడవచ్చు. ఒక వేళ వివరాలను మార్పు చేయాల్సి వస్తే ఎంపీడీవో ఆఫీస్‌ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించారు. ఏవైనా సందేహాలు ఉన్నవారు టోల్‌ ఫ్రీ నంబర్ 1800-4253875 సంప్రదించాలని అధికారులు సూచించారు.

✪ అర్హులైన బాధితులు.. డిపాజిట్లకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలు, చెక్కు, పే ఆర్డర్‌, రశీదులు, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డులను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించాలి.
✪ ఎవరైనా డిపాజిట్‌ దారుడు మరణిస్తే లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌ చూపాలి. నగదును వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.
✪ ఒక డిపాజిట్‌ దారుడు ఒక క్లెయిమ్‌కు మాత్రమే అర్హుడు.
✪ గతంలో రూ.10వేల లోపు డిపాజిట్‌ క్లెయిమ్‌ పొందిన వారు ప్రస్తుతం అనర్హులు.
✪ బాధితుల సమస్యల పరిష్కారానికి 1800 4253 875 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు.

Advertisement

తాజా వార్తలు

Advertisement