Tuesday, May 14, 2024

షిరిడీ సాయి హెల్త్​కేర్​ కోసం అంబులెన్స్​ బహూకరణ.. కోయంబత్తూర్​ భక్తుడి విరాళం!

షిరిడీ సాయిబాబా ట్రస్ట్​కు ఓ అంబులెన్స్​ను ఇవ్వాల (మంగళవారం) బహూకరించారు భక్తులు. సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీ రోగి సేవే హెల్త్‌కేర్ కోసం కోయంబత్తూర్​కు చెందిన భక్తుడు పి. వి. కుమార్‌వాడివేల్, దర్శకుడు కె. అశోక్ కుమార్ ఈ వాహనాన్ని అందించారు. అంతేకాకుండా ఇందులో కార్డియాక్ పరికరాలతో పాటు దాదాపు రూ.35 లక్షల విలువైన ఫోర్స్ కంపెనీకి చెందిన అంబులెన్స్‌ను అందించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి భాగ్యశ్రీ బనాయత్ దాత నుండి అంబులెన్స్ ని స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement