Wednesday, May 1, 2024

ఏపీలో కరోనా జోరు…నాలుగో రోజు 20వేలకు పైగా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజుల పాటు 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే, గత 24 గంటల్లో మళ్లీ 20వేల మందికి పైగా కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. మొత్తం 1,10,571 శాంపిల్స్‌ పరీక్షించగా, 20,065 మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పాజిటివిటీ రేటు 19.75శాతం ఉండగా, అత్యధికంగా 96మంది మృతి చెందినట్లు వెల్లడించారు.చిత్తూరులో అత్యధికంగా  2,269 కరోనా బారిన పడ్డారని, ఆ తర్వాత తూర్పుగోదావరి  2,370, విశాఖ 2525లలో అత్యధిక కేసులు నమోదైనట్లు వివరించారు.

ఇక గత 24 గంటల్లో పశ్చిమగోదావరిలో 14మంది చనిపోగా, విశాఖలో 12మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 7,065 ఐసీయూ పడకలు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పటికే  6,300లకు పైగా పడకలు కరోనా బాధితులతో నిండిపోయానని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement