Friday, April 26, 2024

ఎన్టీఆర్ సేవలు మరువలేనివి : నారా లోకేశ్

టీడీపీ యువ‌నేత నారా లోకేష్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ యువ‌గ‌ళం పాద‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. బుధ‌వారం టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర క్యాంప్ సైట్ లో టీడీపీ జెండాను నారా లోకేశ్ తో క‌లిసి పరిటాల సునీత ఎగుర‌వేశారు. పార్టీని స్థాపించిన ఆ మహనీయుడు నందమూరి తారక రామారావుని స్మరించుకున్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప నాయ‌కుడు ఎన్టీఆర్ అన్నారు. పేద‌ల కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టిన మ‌హానాయ‌కుడు అని కొనియాడారు. ఎన్టీఆర్‌ సేవ‌లు చ‌ర‌స్మ‌ర‌ణీయ‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement