Thursday, April 25, 2024

హిందువుల మ‌నోభావాలు దెబ్బ తీసిందంటూ.. తాప్సీపై పోలీసు కేసు

హిందువుల మ‌నోభాలు దెబ్బ‌తీసిందంటూ హీరోయిన్ తాప్సీపై పోలీసు కేసు న‌మోద‌యింది. ఈ నెల 14న ముంబైలో నిర్వహించిన లాక్మే షోలో తాప్సీ పాల్గొంది. ఈ షోలో రెడ్ కలర్ డీప్ నెక్ గౌన్ లో అర్ధ నగ్నంగా ఉన్న తాప్సీ… మెడలో రిలయెన్స్ జ్యుయెల్స్ ప్రత్యేకంగా తయారు చేసిన లక్ష్మీదేవి ఆభరణాన్ని ధరించి ర్యాంప్ వాక్ చేసింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ని ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే మాలిని గౌర్ కుమారుడు, హింద్ రక్షక్ సంఘటన్ (ఇండోర్) కన్వీనర్ ఏకలవ్య సింగ్ గౌర్ ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతినేలా ప్రవర్తించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మ‌రి ఈ కేసుపై తాప్సీ ఎలా స్పందిస్తుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement