Wednesday, May 15, 2024

మోదీ కేబినెట్‌లో అతి పిన్న వయస్కుడు ఎవరో తెలుసా?

ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కొన్ని కొత్త ముఖాలు చేరాయి. వీరిలో నిషిత్ ప్రమాణిక్ ఒకరు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆయన వయస్సు కేవలం 35 సంవత్సరాలు. ఇప్పుడు మోదీ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడిగా నిషిత్ రికార్డు సృష్టించారు. 2019 లో బెంగాల్‌కు చెందిన కూచ్ బెహర్ సీటు నుంచి నిశిత్ ప్రమాణిక్ ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటిసారి బీజేపీ ఎంపీ అయ్యారు. దీనికి ముందు ఆయన టీఎంసీలో ఉన్నారు. ఎన్నికలకు ముందు టీఎంసీని వదిలి బీజేపీలో చేరారు. ఆయన ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. BCA డిగ్రీ చేశాడు. ఎంపీగా ఉన్న సమయంలో బీజేపీ ఆయనను బెంగాల్‌లోని దిన్హాట సీటు నుంచి పోటీ చేయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు కానీ పార్టీ నాయకత్వం సూచనల మేరకు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

నిశిత్ ప్రమాణిక్ రాజవంశీ సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపారు. ఆయన కూడా రాజవంశీ సంఘం నుంచి వచ్చినవారే కావడం విశేషం. ఉత్తర బెంగాల్‌లో బీజేపీ విస్తరణ వెనుక నిషిత్ ప్రమానిక్ హస్తం ఉంటుంది. కేవలం 35 ఏళ్ల నిసిత్ ప్రమానిక్ తృణమూల్ కాంగ్రెస్ యువ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అయితే 2018 లో బెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీకి వ్యతిరేకంగా సుమారు 300 మంది స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టారు. వీరిలో చాలామంది గెలిచారు.

దీని తరువాత ఆయన ఫిబ్రవరి 2019 లో బీజేపీలో చేరారు. అదే సంవత్సరంలో పార్టీ కూచ్ బెహర్ సీటు నుంచి లోక్‌సభ ఎన్నికలకు టికెట్ ఇచ్చింది. గతంలో బాబుల్ సుప్రియో, దేవశ్రీ చౌదరి బెంగాల్‌కు చెందిన రాష్ట్ర మంత్రులుగా ఉండేవారు. బాబుల్ సుప్రియో అసన్సోల్ ఎంపీ. కేంద్ర మంత్రుల మండలిలో భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల సహాయ మంత్రిగా ఉన్నారు. దేబాశ్రీ చౌదరి రాయ్‌గంజ్‌కు చెందిన బీజేపీ ఎంపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఇద్దరూ మంత్రివర్గం విస్తరణకు ముందే రాజీనామా చేశారు.

ఈ వార్త కూడా చదవండి: కేంద్రమంత్రులు-వారి శాఖలు

Advertisement

తాజా వార్తలు

Advertisement