Thursday, May 9, 2024

Be Care | ప్రాణాలు తీసిన సెల్ఫీ షూట్​.. కొండపై నుంచి నదిలో పడి ముగ్గురు మృతి

సెల్ఫీ షూటింగ్​ ముగ్గురి ప్రాణాలు బలితీసుకుంది. అందులో ఇద్దరు ఈ మధ్యనే పెళ్లి అయిన నవ దంపతులున్నారు. వారిని కాపాడబోయిన వారి దగ్గరి దోస్త్​ కూడా నీట మునిగి చనిపోయిన ఘటన కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జరిగింది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని పల్లిక్కల్ నదిలో కొండపై నుంచి పడి నవ దంపతులు చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. వారిని కాపాడబోయిన వ్యక్తి కూడా నీట మునిగి ప్రాణాలు విడిచాడు. ఫొటోలు తీస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి దంపతులిద్దరూ చనిపోయారు. వారిని కాపాడేందుకు నదిలోకి దూకిన వారి బంధువుల్లో ఒకరు కూడా నీట మునిగి చనిపోయాడు.

మృతులనుసిద్ధిక్, నౌఫీ, అన్సిల్‌గా పోలీసులు గుర్తించారు. కాగా ఆ నవ దంపతులు కొల్లాం జిల్లాకు చెందిన వారిగా తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం అన్సిల్ మృతదేహం లభ్యం కాగా, ఒకరోజు తర్వాత దంపతుల మృతదేహాలు లభించాయి. ఆ ముగ్గురి మృతదేహాలను కొల్లాం జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

వారం రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఓ ఫంక్షన్ కోసం అన్సిల్ ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. అనంతరం ముగ్గురూ ఫొటోలు దిగేందుకు సమీపంలోని నది వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో దంపతులు బ్యాలెన్స్ తప్పి కొండపై నుంచి నదిలో పడిపోయినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement