Friday, May 10, 2024

పార్లమెంట్ లైబ్రరీని సందర్శించిన టీఆర్‌ఎస్ కొత్త ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కొత్తగా ఎన్నికైన టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని లైబ్రరీని సందర్శించారు. పార్లమెంట్ లైబ్రరీ కమిటీ ఛైర్మన్, ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో నూతన రాజ్యసభ సభ్యులు దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి మంగళవారం లైబ్రరీ వెళ్లి అక్కడి పుస్త‌కాల‌ను ప‌రిశీలించారు. భార‌త రాజ్యాంగ ప్ర‌తిని కూడా చూశారు. ఈ సంద‌ర్భంగా వారికి నామా ఇక్కడి పుస్తకాల విశిష్టతను ప్రత్యేకంగా వివరించారు. పార్లమెంట్ వ్యవహారాలకు, ఎంపీలకు రిఫరెన్స్‌గా లైబ్రరీలో పొందుపరిచిన సమాచారం ఎలా ఉపయోగపడుతుందో వారికి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement