Tuesday, May 21, 2024

కాసేపట్లో పెళ్లి.. ఓటేసిన నవ వధువు

మహబూబ్‌నగర్‌ జిల్లా మల్కాపూర్‌ గ్రామానికి చెందిన ఫిర్దోస్‌ బేగం అనే యువతి కాసేపట్లో తన వివాహం ఉన్నా ఓటు హక్కు వినియోగించుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ఆదివారం ఉదయం 10 గంటలకు ఆమె పెళ్లికి అన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో వధువు ఉదయం 8:30 గంటలకు కోయిలకొండ మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకుంది. ఆ తర్వాత వెంటనే ఆ తర్వాత వెంటనే పెళ్లి కోసం ఫంక్షన్‌‌ హాలుకు బయలుదేరి వెళ్లింది. ఎన్నికల సమయంలో సెలవు ఉన్నా.. కొందరు అందుబాటులో ఉన్నా చాలా చోట్ల ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కాగా కాసేపట్లో తన వివాహం ఉన్నా.. బాధ్యత కలిగిన పట్టభద్రురాలిగా ఓటుహక్కు వినియోగించుకున్న ఫిర్దోస్‌ బేగంను పలువురు అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement