Thursday, May 2, 2024

నీతు అంబానీ ఫోన్ ఖ‌రీదు జెస్ట్ రూ. 395 కోట్లు

ముంబై – భారతదేశ కుబేరు జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని ముకేష్ అంబానీకి ఉన్న సౌకర్యాలు ఎవరికీ లేవనడంలో ఎలాంటి సందేహం లేదు. లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్‌లు, ఖరీదైన భవనాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా ఉంటుంది. ముఖేష్ అంబానీలాగే తన భార్య నీతా అంబానీ కూడా విలాసవంతమైన వస్తువులను కలిగి ఉన్నారు. ఆమె ఏ కార్యక్రమానికి హాజరైన తను ధరించిన దుస్తులు, హ్యాండ్ బ్యాగులు ఆ ప్రోగ్రామ్ కే సెంటార్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతాయి. భర్త లాగే ఆమె ఉపయోగించే లగ్జరీ సేకరణలో కార్లు, ఇళ్ళు, జెట్ విమానాలు వంటివి కూడా ఉన్నాయి.

ఇప్పుడు అందరూ ఆమె వాడుతున్న స్మార్ట్ ఫోన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆమె వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైనది. నీతా అంబానీ స్మార్ట్‌ఫోన్ ధర ఊహకు కూడా అందనిది. నీతా అంబానీ వాడే స్మార్ట్‌ఫోన్ ధర ఎంతో తెలిస్తే షాక్‌ తింటారు. ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఫోన్. దీనికి ఎందుకు అంత ధర ఉంటుందంటే దానిలో పొందుపరిచిన విలువైన పింక్ డైమండ్ కారణం. ఇక ఈ ఫోన్ ధర 48.5 మిలియన్లు డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 395 కోట్లు. . నీతా అంబానీ ఫోన్ ఖరీదుతో కొన్ని చార్టర్డ్ విమానాలను కొనుగోలు చేయొచ్చట.

Advertisement

తాజా వార్తలు

Advertisement