Friday, May 3, 2024

జంటిల్‌మన్‌ 2లో హీరోయిన్గా నయనతార చక్రవర్తి..

ప్రముఖ నిర్మాత కె.టి.కుంజుమన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం జెంటిల్‌మన్ 2.. దీంతో తిరిగి నిర్మాణరంగంలోకి వచ్చారు. ఇది అర్జున్‌ సర్జా, మధుబాల నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘జెంటిల్‌మన్‌’కి సీక్వెల్‌గా రూపొందబోతోంది. మలయాళంలో బాలనటిగా అనేక చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్న నయనతార చక్రవర్తి ‘జెంటిల్‌మన్‌ 2’తో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కుమార్తెగా నటించింది. ఆ తర్వాత నయనతార చక్రవర్తి చేస్తున్న సినిమా ఇది.

ఈ సినిమాలో మరో కథానాయిక కూడా నటించ నున్నారు. ఎవరనేది త్వరలో వెల్లడికానుంది. కె.టి.కుంజుమన్‌ తన టిట్టర్‌లో ఈ విషయాన్ని తెలియ జేస్తూ, ప్రధాననటిగా నయనతార చక్రవర్తిని పరిచయం చేస్తున్నాం. మరో కథానా యికను త్వరలో వెల్లడిస్తాం అని పేర్కొ న్నారు. ఎం.ఎం. కీరవాణి ‘జెంటిల్‌ మన్‌ 2’కి సంగీతం అం దించను న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement