Saturday, April 20, 2024

బిడ్డకు జన్మనిచ్చిన ప‌దో తరగతి విద్యార్థిని.. ఓ దుర్మార్గుడు చేసిన ఘాతుకం..

రొంపిచెర్ల, (ప్రభ న్యూస్): పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక పసిబిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 15 ఏళ్ల బాలిక‌ను ఇద్దరి బిడ్డల తండ్రి అయిన ఓ దుర్మార్గుడు బలవంతం చేయడంతోనే ఇదంతా జరిగింది. నాలుగు, ఐదు సార్లు ఆ బాలికపై అత్యాచారం చేసి ఇంట్లో చెపితే వీడియోలు, ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరించడంతో భయపడి ఎవరికి చెప్ప‌కుండా ఉండిపోయింది. దీని ఫలితంగా విద్యార్థిని గ‌ర్భం దాల్చిన విష‌యం కూడా ఎవ‌రికీ తెలియ‌లేదు. రొంపిచెర్ల మండలానికి చెందిన ఓ విద్యార్థిని ఉన్నత పాఠశాలలో ప‌దో తరగతి చ‌దువుతోంది. బాలిక సంవత్సరం క్రితం కరోనా ప్రభావంతో కొద్ది రోజులు రొంపిచెర్లలోని తన పెద్దనాన్న ఇంట్లో ఉంది. అక్కడ ఎలక్ట్రీషియన్ పనికి వచ్చిన పీలేరు మండలం ఎర్రగుంట్ల పల్లెకు చెందిన రాజేష్ (34) ఆ బాలిక‌తో పరిచయం పెంచుకున్నాడు.

తర్వాత బొమ్మయ్యగారి పల్లి, దండపానితోపు వద్ద గల విద్యార్థిని ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు రెండు కిలోమీటర్లు దూరం నడిచి వచ్చి వెళుతూ ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు బాలికను రోడ్డు పక్కనే ఉన్న జమ్ము చెరువులోకి బలవంతంగా లాక్కెల్లి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో వీడియోలు, ఫొటోలు తీసుకొని తల్లిదండ్రులకు చెపితే వీటిని వాట్సాప్, యుట్యూబ్, ఫేస్ బుక్ లలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఒక వైపు ఇంట్లో చెప్పుకోలేక, మరో వైపు కడుపులో ఏం జరుగుతోందో తెలుసుకోలేక కాలం గడిపింది. 10 రోజుల నుంచి విద్యార్థిని కడుపు నొప్పితో బాధపడుతూ పాఠశాలకు వెళ్లడం మానేసింది. బుధవారం రొంపిచెర్లలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి చికిత్సకోసం తీసుకెళ్ల‌గా పరీక్షించిన డాక్టర్లు విద్యార్థిని గర్భిణి అన్న విషయం చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.. దానిక గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే విద్యార్థిని కడుపునొప్పిఎక్కువ కావడం, మగ బిడ్డకు జన్మనివ్వడం జరిగిపోయింది. దీంతో తండ్రి సహాయంతో విద్యార్థిని గురువారం సాయంత్రం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement