Thursday, May 2, 2024

తాలిబన్లకు మద్దతిస్తారా? పలు ముస్లిం వర్గాలపై బాలీవుడ్ నటుడు ఆగ్రహం

అఫ్గానిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లను సమర్థిస్తున్న కొందరు భారతీయ ముస్లింలపై బాలీవుడ్​ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లు అధికారంలోకి వస్తే.. కొన్ని ముస్లిం వర్గాలు సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు తిరిగి రావడం వల్ల ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతుందని అన్నారు. కానీ మన దేశంలోని కొన్ని ముస్లిం వర్గాలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇది ప్రమాదకరం అని పేర్కొన్నారు. ఇస్లాంను సంస్కరించి ఆధునికతకు మద్దతివ్వాలో లేదా ఆటవిక, అనాగరిక సంప్రదాయలు ఉన్న విలువలతో బతకాలో భారతీయ ముస్లింలు తమను తాము ప్రశ్నించుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: కరోనా నిరోధంపై కేసీఆర్ సర్కార్ కు చిత్తశుద్ధి ఉందా?

Advertisement

తాజా వార్తలు

Advertisement