Sunday, May 12, 2024

HYD | కల్లు దుకాణాలపై నార్కోటిక్‌ బ్యూరో దాడులు.. 69 కాంపౌండ్‌లు సీజ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: హైదరాబాద్‌ జంటనగరాల్లో కల్లు కాంపౌండ్లపై నార్కోటిక్‌ బ్యూరో దాడులు నిర్వహించింది. 69 కల్లు కాంపౌండ్లను నార్కోటిక్‌ బ్యూరో సీజ్‌ చేసింది. కృత్రిమ కల్లును తయారు చేసి విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు.

అల్ఫాజోలం, నిమ్మ ఉప్పు, మినప్పిండితో కృత్రిమ కల్లు తయారు చేస్తున్నట్టు- అధికారులు గుర్తించారు. పోలీసులు, నార్కోటిక్‌ బ్యూరో సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. కల్లు కాంపౌండ్లలో సేకరించిన శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. కృత్రిమ కల్లుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావటంతో సోదాలు జరిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement