Monday, April 29, 2024

ఆడబిడ్డలు బలైపోతుంటే సీఎం సిమ్లాలో ఎంజాయ్ చేసొచ్చారు: నారా లోకేశ్

ఏపీ సీఎం జగన్ సిమ్లా పర్యటనపై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. విజయవాడ సత్యనారాయణపురంలో బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన, రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి అద్దంపడుతోందని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో సీఎం హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం సిమ్లా వెళ్లి రావడంపై టీడీపీ లోకేశ్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో రోజుకో ఆడబిడ్డ బలైపోతుంటే సీఎం సిమ్లాలో ఎంజాయ్ చేసొచ్చారని విమర్శించారు. గుంటూరులో రమ్య హంతకుడికి న్యాయం జరిగేదెప్పుడని ప్రశ్నించారు. “ఇక 8 పనిదినాలు మాత్రమే మిగిలున్నాయి… రమ్యని అంతం చేసినవాడికి ఉరేసి మహిళలకు భరోసా ఇచ్చేది ఎప్పుడు? ఆడపిల్లలపై క్రూరజంతువుల్లా పడి వేధించేవారికి కఠినశిక్షలు పడేది ఎప్పుడు? ఈ రాష్ట్రంలో మహిళలకు జీవించే హక్కు లేదా?” అంటూ లోకేశ్ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: నవారు మంచం ధర రూ.41,297

Advertisement

తాజా వార్తలు

Advertisement