Thursday, May 16, 2024

నాగార్జునసాగర్ పోటెత్తిన వ‌ర‌ద‌… 575.80 అడుగులకు చేరిన నీటిమట్టం…

రాష్ట్రంలో వ‌ర్షాలు భారీగా కురుస్తున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 1,47,254 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 13,184 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటి మట్టం 575.80 అడుగులకు చేరింది. అలాగే నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 271.1256 టీఎంసీలుగా నమోదు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement