Saturday, May 18, 2024

BRO | “మై డియ‌ర్ మార్కండేయ‌”.. రేపే ఫ‌స్ట్ సింగిల్ రిలిజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్రో ది అవతార్. ఈ సినిమా ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక‌ రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మొదట్లో ఈ సినిమా రీమేక్ చేస్తున్నందుకు నిరాశ చెందారు అభిమానులు.. అయితే, టీజర్ విడుదలయ్యాక ఈ సినిమాపై అటు అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ లోనూ ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ హైప్ పెరుగుతూనే ఉంది.

కాగా, ఈ సినిమా మొదటి పాట విడుదల కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “మై డియర్ మార్కండేయ” ఈ పాట విడుదల తేదీని రేపు సాయంత్రం4.5 నిమిషాల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్టు కొద్ది సేప‌టి క్రితం అధికారికంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ (పవన్ కళ్యాణ్) కాంబినేషన్ లో ఈ పాట రానుంది. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాట కూడా క్లిక్ అయితే ప్రేక్షకుల్లో ఈ సినిమా అంచనాలు మ‌రింత‌ భారీగా పెరిగే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement