Sunday, April 28, 2024

Munugode Bypoll : రాజగోపాల్‌ రెడ్డికి ఈసీ నోటీసులు..

మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ స‌మీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగిందని టీఆర్‌ఎస్ నేత సోము భరత్ కుమార్ ఫిర్యాదుతో ఈసీఐ స్పందించింది. కోమటిరెడ్డి కంపెనీ ఖాతాల నుంచి 5 కోట్ల 24 లక్షల రూపాయలు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారో వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీపై సోమవారం సాయంత్రం 4 గంటల లోపు వివరణ ఇవ్వాలని రాజ్ గోపాల్ రెడ్డికి ఈసీ ఆదేశించింది. ఒకవేళ సాయంత్రం తరువాత సమాధానం రాకుంటే రాజగోపాల్ రెడ్డి పై త‌గు నిర్ణయం తీసుకుంటామ‌ని ఈసీ హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement