Thursday, May 9, 2024

WPL | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతన్నాయి. కాగా, ఇవ్వాల (శనివారం) మరో మ్యాచ్‌కు సిద్ధమయ్యారు మహిళలు. టోర్నీలోని 9వ మ్యాచ్‌లో భాగంగా.. ముంబై ఇండియన్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్లు తలపడనున్నాయి. కాగా, బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

ముంబై ఇండియన్స్ ఉమెన్ :

హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, యాస్తికా భాటియా (WK), నాట్ స్కివర్-బ్రంట్ (c), అమేలియా కెర్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, ఇసాబెల్లె వాంగ్, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, సజీవన్ సజన, సత్యమూర్తి కీర్తన

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ :

స్మృతి మంధాన (సి), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (WK), జార్జియా వేర్‌హామ్, సోఫీ మోలినక్స్, శ్రేయాంక పాటిల్, సిమ్రాన్ దిల్ బహదూర్, ఆశా శోబన, రేణుకా సింగ్ థాక్

- Advertisement -

కాగా, ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. ఈ రెండు జట్లు మూడు మ్యాచ్‌లు ఆడగా ఒక మ్యాచ్‌లో ఓడిపోయాయి. వరుసగా రెండు విజయాలతో అద్భుత ప్రదర్శన చేసిన బెంగళూరు గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పరాజయం పాలైంది. అలాగే బలమైన జట్టుగా గుర్తింపు పొందిన ముంబై పై యూపీ వారియర్స్ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌తో ఈ రెండు జట్లు మళ్లీ విజయ బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఆర్సీబీ రెండో స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement