Monday, May 20, 2024

రాష్ట్రపతి తేనీటి విందులో ఎంపీ ఉత్తమ్‌ దంపతులు.. సైనికాధికారులతో కోవింద్ ఆత్మీయ సమ్మేళనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన తేనీటి విందులో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. స్వాతంత్య్రానంతరం రాష్ట్రపతి భవన్‌లో పని చేసిన, ప్రస్తుతం పని చేస్తున్న సైనికాధికారులతో రామ్‌నాథ్ కోవింద్ అత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన సతీమణి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సైనికాధికారులతో దిగిన గ్రూప్ ఫొటోలో ఉత్తమ్, రామ్‌నాథ్ కోవింద్‌కు ఎడమ వైపున ఆసీనులయ్యారు. రాష్ట్రపతి నిర్వహించిన ఇష్టాగోష్టికి, తేనీటి విందుకు ఆహ్వానం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన గతంలో రాష్ట్రపతి ముఖ్య భద్రతాధికారిగా రాష్ట్రపతి భవన్‌లో పని చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement