Sunday, April 28, 2024

రేపు మోత్కుపల్లి నర్సింహులు ఒక్కరోజు నిరాహార దీక్ష

సీఎం కేసీఆర్ పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీరుకు నిరసనగా ఆదివారం నాడు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు దీక్షకు దిగనున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మోత్కపల్లి వ్యాఖ్యానించారు. దళిత సాధికారితకోసం సభలు, సమావేశాలు నిర్వహించి దళితుల సంక్షేమం కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఉపన్యాసాలు ఇవ్వడం, దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలు నిర్వహించడం విస్మయానికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డి పుట్టడమే దొరల వంశంలో జన్మించాడని.. తన స్వగ్రామంలో దళితుల మధ్య నిద్రలు చేసి భోజనం చేయగలడా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు. గత 70 సంవత్సరాలుగా ఎంతో మంది దళితులు ఆయన ఇంటి ముందు నుండి చెప్పులు వేసుకొని నడిచారో రేవంత్ రెడ్డి చెప్పగలడా.? అని నిలదీశారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించడం ఎంతో శోచనీయమని ఫైర్‌ అయ్యారు. దళితులను ముందు వరుసలో నుంచోబెట్టి రాజకీయం చేయడం, దళితుల మీద ప్రేమ వలకబోసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడాన్ని పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు. దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నందుకు నిరసనగా ఈ నెల 29న ఆదివారం బేగంపేట తన నివాసంలో ఒకరోజు దీక్ష చేస్తున్నట్లు మోత్కుపల్లి తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్

Advertisement

తాజా వార్తలు

Advertisement