Saturday, May 4, 2024

ఏపీలో పెరిగిన కరోనా తీవ్రత – 24 గంటల్లో 22 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 1000 కాదు 2000 కాదు ఏకంగా గడచిన 24 గంటల్లో 6582 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రం లో ఇప్పటివరకు నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 9,62,037 కు చేరింది. అలాగే 9,09,941 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 44,686 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

మరో వైపు గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 22 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,410 మంది మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో ఏపీలో 2,343 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement