Friday, April 19, 2024

ఐఏఎస్..ఐపీఎస్ అధికారులపై.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మోహ‌న్ బాబు

ఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉంటే వారి కోస‌మే ఐఏఎస్..ఐపీఎస్ అధికారులు ప‌ని చేస్తార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు న‌టుడు మోహ‌న్ బాబు. ఆయన చేసిన వ్యాఖ్య‌లు సినీ.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తిరుపతిలో జరిగిన హీరో విశాల్ లాఠీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు మోహన్ బాబు. ఆ వేదిక మీద నుంచి మోహన్ బాబు ఈ వాఖ్యలు చేశారు. ముఖ్యంగా మోహన్ బాబు పోలీసు ఉన్నతాధికారులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పోలీసులంటే గౌరవం ఉందని.. ఎప్పుడూ నిజాన్ని నిర్భయంగా చెప్తానని ఆయన స్పష్టం చేశారు.ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తుంటారని విమర్శించారు. కింది స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు, పోలీసులపై పై స్థాయిలో ఉన్న ఐపీఎస్ ల ఒత్తిడి ఉంటుందని మోహన్ బాబు చెప్పారు.

‘సార్ ఇది నిజం, ఇది జరిగింది, నేను కళ్లా చూశాను, మీరు తప్పు చెప్పమంటున్నారు, నేను నిజం చూశాను అని కింది స్థాయి వాళ్లు చెపితే అతని ఉద్యోగం పోతుందని అన్నారు. మోహన్ బాబు అంటే కాంట్రవర్సీ..కాంట్రవర్సీ అంటే మోహన్ బాబు అన్నట్టు తయారయ్యింది ప్రస్తుత పరిస్థితి. ఆయన ముక్కుసూటి మనస్తత్వం ఉన్న వ్యక్తి.. ఎక్కడ ఎవరు ఉన్నారు అని చూడకుండా మాట్లాడి.. చాలా సార్లు వివాదాలకు కారణం అవుతుంటాయి. తన మనసులో ఉన్న మాటను ఎలాంటి సంకోచం లేకుండా బయటకు చెప్పడం మోహన్ బాబుకు అలవాటు.. ఇక ఈక్రమంలోనే ఆయన తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మ‌రి దీనిపై ఆఫీస‌ర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement