Monday, April 29, 2024

National : బీజేపీ నేత‌ల‌కు మోదీ శుభాకాంక్ష‌లు…

భారతీయ జనతా పార్టీ తన 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం జరుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. ఇక కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోడీ ఇవాళ‌ ప్రసంగించనున్నారు.

- Advertisement -

మోడీ..
ఇక బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ కార్యకర్తలనుద్దేశించి ట్వీట్ చేశారు. భారతదేశం నలుమూలలా ఉన్న పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయులందరి కృషి, పోరాటాలు, త్యాగాలను స్మరించుకుందామని చెప్పారు. పార్టీ ఈ స్థాయిలో ఉండడానికి అనేక సంవత్సరాలుగా నాయకులు కష్టపడ్డారని గుర్తుచేశారు. బీజేపీకి ఎప్పుడూ దేశమే ప్రాముఖ్యమని.. దేశ అభివృద్ధి కోసం బీజేపీ పని చేస్తోందని మోడీ తెలిపారు.



అమిత్ షా..
బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా మార్చే ప్రయాణంలో తమ జీవితాలను అంకితం చేసిన కార్యకర్తలకు నమస్కరిస్తున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. భారత్‌ను ప్రధాని మోడీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు.

జేపీ నడ్డా..
దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరించడానికి కృషి చేసిన కార్యకర్తలకు, నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో వికసిత భారత్ కోసం కార్యకర్తలు కృషి చేయాలని.. సార్వత్రిక ఎన్నికల్లో మరింతగా పార్టీ విజయానికి కృషి చేయాలని నడ్డా పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement