Thursday, April 25, 2024

ఢిల్లీలో మోడీ రోడ్ షో.. ప్రత్యక్ష్య ప్రసారం

న్యూ ఢిల్లీ – బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌కు ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు.. దేశ రాజధానిలోని నేటి నుంచి జ‌ర‌గ‌నున్న‌ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు 35 మంది కేంద్ర మంత్రులు, 12 మంది బీజేపీ ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, 37 రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు, మరో 27 మంది సంఘటన్ మంత్రులు, మహా మంత్రులు, క్షేత్రీయ సంఘటన్ మంత్రులు పాల్గొంటారు. అలాగే 19 మంది మాజీ ముఖ్యమంత్రులు, 12 మంది మాజీ ఉప ముఖ్యమంత్రులు, 17మంది ఫ్లోర్ లీడర్లు, 168 మంది లోక్‌సభ, రాజ్యసభ చీఫ్ హెడ్‌లు, 182 ఇతర సభ్యులు కూడా ఈ సమావేశంలో భాగం కానున్నారు. మొత్తం 350 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం ఆ పార్టీ మొదటిరోజు భారీ రోడ్‌షో నిర్వహిస్తున్నది. ఈ రోడ్ షో స‌ర్దార్ ప‌టేల్ చౌక్ మీదుగా ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంట‌ర్ వ‌ర‌కూ సాగ‌నుంది. ఈ రోడ్ షో లో మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. ఈ ర్యాలీని ప్రత్యక్ష్య ప్రసారంగా తిలకించండి

Advertisement

తాజా వార్తలు

Advertisement