Monday, April 29, 2024

5న హ‌స్తిన‌కు ఎమ్మెల్సీ కవిత..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లకు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్ పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్ నామినేట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్, ఎంపీలు జయంత్ చౌదరీ, సంజయ్ సింగ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్, మాజీ ఎంపీ దిలీప్ టిర్కే, హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement