Thursday, April 25, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల డ్యూటీకి వ‌చ్చి.. అనారోగ్యంతో చ‌నిపోయిన ఉద్యోగి

ఏపీలో జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల డ్యూటీకి వ‌చ్చిన ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి ఆక‌స్మికంగా చ‌నిపోయిన ఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో ఇవ్వాల (ఆదివారం) జ‌రిగింది. కావలికి చెందిన సయ్యిద్ ఖాజా మొహిద్దిన్ (56)గా గుర్తించారు. ఇతను APSPDCLలో సీనియర్ అసిస్టెంట్ గా ప‌నిచేస్తున్నాడు. MLC ఎన్నికల విధులకు రాగా, ఇవ్వాల‌ మధ్యాహ్నం అస్వ‌స్త‌కు గుర‌య్యాడు. దీంతో అత‌డిని వెంట‌నే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్క‌డే చ‌నిపోయిన‌ట్టు డాక్ట‌ర్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement