Sunday, April 28, 2024

Mulugu – నియోక‌వ‌ర్గ అభివృద్ధి నిథుల కోసం హైకోర్టు మెట్టెక్కిన ఎమ్మెల్యే సీత‌క్క

ములుగు – నిధుల విడుదలకు సంబంధించి కోర్టుకెక్కారు కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క. తన నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిధుల మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వున్నందునే తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని సీతక్క పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నిధుల మంజూరులో జిల్లాకు చెందిన మంత్రి జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధమని ఆమె దుయ్యబట్టారు. జిల్లా మంత్రి ఆమోదంతోనే నిధులు మంజూరు చేయాలన్న జీవోను కొట్టివేయాలని సీతక్క ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు భుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది హైకోర్ట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement