Sunday, April 28, 2024

ఉచిత క‌రెంట్ వ‌ద్దు..ఎమ్మెల్యే రాఘ‌వ్ కావాలని ట్వీట్ చేసిన యువతి..

ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తామంటే మన దేశంలో సామాన్య ప్రజానీకం ఎవరు కూడా అడ్డు చెప్పరు..కాని ఓ యువతి తనకు ఉచిత కరెంట్ వద్దని తెగేసి చెబుతోంది.. అంతేకాదు బదులుగా ఓ యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే నే కావాలని కోరుతోంది. వివరాల్లోకి వెళితే..పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత క‌రెంట్‌ను పొందొచ్చు అని గుర్దీప్ గురు అనే ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన కీర్తి ఠాకూర్‌.. త‌న‌కు ఉచిత క‌రెంట్ వ‌ద్దు.. ఆప్ ఎమ్మెల్యే రాఘ‌వ్ చ‌ద్దా కావాల‌ని ట్వీట్ చేసింది. ఆప్ ఎమ్మెల్యే రాఘ‌వ్ చ‌ద్దా చూడ‌డానికి అందంగా ఉంటారు. మంచి మాట‌కారి కూడా. అందులోనూ యువ‌కుడు. అలాంటి యంగ్ లీడ‌ర్‌ను ఇష్ట‌ప‌డ‌ని యువ‌తులు ఉంటారా? అంటే ఉండ‌ర‌నే చెప్పొచ్చు. అందుకే ఈ యువతి ఎమ్మెల్యే పై మనసు పారేసుకున్నట్లుంది. దీంతో త‌న‌కు ఉచిత క‌రెంట్ వ‌ద్దు.. రాఘ‌వ్ చ‌ద్దానే కావాల‌ని ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‌పై ఎమ్మెల్యే రాఘ‌వ్ చ‌ద్దా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ చ‌మ‌త్కారంగా స‌మాధానం ఇచ్చారు. ఆప్ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో తాను లేను. ఉచిత విద్యుత్ మాత్ర‌మే ఉంది. కేజ్రీవాల్‌కు ఓటేయండి.. త‌ప్ప‌కుండా మీ ఇంటికి 24 గంట‌ల పాటు ఉచిత విద్యుత్ అందేలా చూస్తాన‌ని రాఘ‌వ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: బోనమెత్తిన వైఎస్ షర్మిల..

Advertisement

తాజా వార్తలు

Advertisement