Sunday, May 5, 2024

నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ తో చేయూత : ఎమ్మెల్యే దాసరి

అనారోగ్యాల బారిన పడి.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ తో చేయూతనిస్తునామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో నియోజకవర్గంలోని 298 మంది లబ్ధిదారులకు కోటి 14 లక్షల, 71 వేల, 900 రూపాయలు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్ద పీట వేస్తుందన్నారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్న వారికి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నామన్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రద్దీ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు. కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement