Wednesday, May 1, 2024

ఈ వేదిక‌పై తార‌క్ ని మిస్ అవుతున్నా.. రామ్ చ‌ర‌ణ్

ప్రేక్షకులు చూపించే ప్రేమ.అభిమానుల ఆద‌ర‌ణే త‌న‌ను కెరీర్ లో సుదీర్ఘ‌తీరాల‌కు న‌డిపిస్తుంద‌ని అన్నారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. మిగిలిన వాళ్ల‌కు కూడా ఇలాగే ఉంటుందా? లేకుంటే నాకు మాత్రం ఇలా ఉందో తెలియ‌దు. కానీ, నటుడిగా ఈ క్ష‌ణాల‌ను మ‌న‌స్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. ఈ క్ష‌ణాల కోస‌మే ఎంత కష్టమైనా పడ్డాను. ప్రేక్షకులు అందరినీ ఎంటర్టైన్ చేయాలనేదే నా ప్ర‌య‌త్నం. ఇలాంటి స్పంద‌నే నేను కోరుకున్నాను. RRRని మార్చి 1న లాస్ ఏంజిల్స్‌లోని ఏస్ హోటల్ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ వేడుక‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు ద‌ర్శ‌క దీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్‌ కుమార్ హాజరయ్యారు.

RRR ప్ర‌ద‌ర్శ‌న పూర్త‌యిన వెంట‌నే యూనిట్ స‌భ్యుల‌ను థియేటర్లో చ‌ప్ప‌ట్ల‌తో గౌర‌వించారు. స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చారు. దీనిపై రామ్ చ‌ర‌ణ్ స్పందించారు. ఇంత‌గా ఆద‌రాభిమానాలు చూపిస్తున్నందుకు, ప్ర‌శంసిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు. ఇంత గొప్ప చిత్రంలో న‌న్ను భాగం చేసిన మా ద‌ర్శ‌కులు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి గారికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను అని రామ్ చరణ్ అన్నారు. ఎన్టీఆర్ గురించి చ‌ర‌ణ్‌ మాట్లాడుతూ ఇప్పుడు నేను, తార‌క్ బెస్ట్ ఫ్రెండ్స్. అందుకు ట్రిపుల్ ఆర్‌కి ధ‌న్య‌వాదాలు. ట్రిపుల్ ఆర్ వ‌ల్ల మేం త‌ర‌చూ క‌లిసే వాళ్లం. చాలా స‌న్నిహితుల‌మ‌య్యాం. మ‌మ్మ‌ల్ని క‌ల‌పాల‌నే ఆలోచ‌న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కి క‌లిగిన‌ట్టుంది. అందుకే మ‌మ్మ‌ల్ని ఇద్ద‌రినీ ట్రిపుల్ ఆర్ కోసం తీసుకున్నారు. ట్రిపుల్ ఆర్‌లో తార‌క్ న‌టించ‌డం వ‌ల్ల సోద‌ర‌ భావాన్ని చూపించ‌డం తేలికైంది. త‌న‌తో క‌లివిడిగా ఉండ‌గ‌లిగాను అని అన్నారు. తార‌క్‌ని ఆ వేదిక మీద మిస్ అవుతున్నానని రామ్ చరణ్ విచారం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement