Sunday, May 5, 2024

ఎమ్మెల్యే కుమారుడి లంచావతారం – రూ.6 కోట్ల న‌గ‌దు సీజ్

బెంగళూరు/దావణగెరె: బిజెపి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కేఎస్ డీల్ అధ్యక్షుడి స్థానంలో ఉన్న ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకుని ఆడుతున్న ఆయన కొడుకు, ప్రభుత్వ ఉద్యోగి మీద లోకాయుక్త పంజా విసిరింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చెన్నగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే మాడాళ్ విరుపాక్షప్ప బీజేపీలో సీనియర్ నాయకుడు. ఎమ్మెల్యే విరుపాక్షప్ప కేఎస్ డీఎల్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఇంచుమించు మంత్రి క్యాడర్ ర్యాంకులో బీజేపీ ఎమ్మెల్యే విరుపాక్షప్ప ఉన్నారు. విరుపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ కర్ణాటక ప్రభుత్వంలో గెజిటెడ్ అధికారి ర్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక కాంట్రాక్టు ఇచ్చే విషయంలో రూ. 40 లక్షలు లంచం తీసుంటూ ఎమ్మెల్యే కొడుకు ప్ర‌శాంత్ లోకాయుక్త‌కు అడ్డంగా చిక్కిపోయాడు. ఆ వెంట‌నే అత‌డి ఇంటిలో అధికారులు సోదాలు చేశారు. ఎమ్మెల్యే కొడుకు, ప్రభుత్వ అధికారి అయిన వ్యక్తి ఇంటిలో ఏకంగా రూ. 6 కోట్ల నగదు చిక్కడం కలకలం రేపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement