Sunday, May 5, 2024

ప‌వ‌న విద్యుత్ ఆరోప‌ణ‌ల‌పై మోడీ, ఆదానీల‌ను విమ‌ర్శిస్తూ … మంత్రి కేటీఆర్ ట్వీట్

తెలంగాణ‌ రాష్ట్ర ఐటీ శాఖ‌ మంత్రి కేటీఆర్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, పారిశ్రామిక‌వేత్త అదానీని విమ‌ర్శిస్తూ ట్వీట్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను కేంద్రం టార్గెట్ చేయ‌డం సాధార‌ణ‌మే అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. మ‌రి శ్రీలంక ప‌వ‌న విద్యుత్ కాంట్రాక్టుల్లో ప్ర‌ధాని మోదీ జోక్యం ఉంద‌ని ఆ దేశ సీనియ‌ర్ అధికారులే ఆరోపిస్తున్నారు. మ‌రి దీనిపై ప్ర‌ధాని మోదీ, అదానీ ఎందుకు స్పందించ‌డం లేదు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement