హైదరాబాద్ లో నిన్న మరణించిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరీ కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. హైదారాబాద్ లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలోని వారి ఇంటికి వెళ్ళిన మంత్రి… ఉమా మహేశ్వరి కుటుంబం, ఆమె సోదరుడు హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ, మోహనకృష్ణ తదితరులతో మాట్లాడి వారిని ఓదార్చారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… తెలుగు ప్రజలు తీవ్ర విషాదంలోకి వెళ్లారన్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో నాకు 40 ఏండ్లకు పైగా అనుబంధం ఉంది, వారి కుటుంబ సభ్యులంతా నాకు కుటుంబ సభ్యులే అన్నారు. ఆమె ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మంత్రి ఎర్రబెల్లి వెంట ఢిల్లీ తెలంగాణ ప్రతినిధి వేణుగోపాల చారి తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement