Wednesday, May 1, 2024

నోటీసులకు సమాధానమిస్తా-బొత్స

కోర్ట్ నోటీసులపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన ఉత్తర ప్రత్యుత్తరాలు లీక్ పై సీబీఐ విచారణ చేయాలంటూ హై కోర్ట్ ను నిమ్మగడ్డ రమేష్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఇక నోటీసుల స్పందించిన బొత్స నోటీసుల విషయం ఇప్పుడే తెలిసింది. కోర్ట్ ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని అన్నారు.

ఇచ్చిన నోటీసుకు సమాధానమిస్తాము.. ఆయనకు సంబంధించిన సీక్రెట్స్ ఏమి బయటకు వచ్చాయో నాకైతే అర్థం కావడం లేదని అన్నారు బొత్స. ఆయనైనా, నేనైనా హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తెరగాలన్నారు. ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి తాను రానంటూ నిమ్మగడ్డ చెప్పిన విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ చూసుకుంటుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement