Saturday, April 27, 2024

కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలుపు మాదే..మంత్రి బొత్స‌..

కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలుపు వైసీపీదేన‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకునేలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఆయన తీరు వుందన్నారు. ఎలాగూ ఓడిపోతామని తెలుసు కాబట్టే అధికార వైసీపీ దొంగ ఓట్లు వేయించిందని, అల్లర్లకు పాల్పడ్డారంటూ పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలింగ్ సిబ్బంది, పోలీసుల సాయంతో తాము అక్రమాలకు పాల్పడ్డామంటున్న టిడిపి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. దొంగ ఓట్ల సంస్కృతి ఎవరిదో అందరికి తెలుసని బొత్స పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement