Saturday, May 4, 2024

టికెట్ ధరలను పెంచనున్న మెట్రో.. 25 నుంచి 30 రూపాయ‌లు పెరిగే చాన్స్‌?

చార్జీలు పెంచేందుకు హైదారాబాద్ మెట్రో సిద్ధమైంది. టికెట్ చార్జీలను 25 నుంచి 30 రూపాయ‌ల దాకా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. వచ్చే జనవరి నుంచి పెంచిన చార్జీలు అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చార్జీల పెంపుపై నియమించిన ఫెయిర్ ఫిక్సెషన్ కమిటీ ఈమేరకు ఓ నివేదికను మెట్రో యాజమాన్యానికి అందించింది. చార్జీల పెంపునకు బదులు మాల్స్ నిర్మాణం, స్థలాల లీజు వంటి ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ఆ నివేదికలో సూచించినప్పటికీ.. చార్జీల పెంపునకే మెట్రో మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement