Saturday, May 4, 2024

తొలి దళిత, యంగెస్ట్​ మేయర్​ ఫర్​ చెన్నై.. ఆర్​. ప్రియ బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమే

చెన్నై కార్పొరేషన్‌కు మేయర్ అభ్యర్థిగా 28 ఏళ్ల ప్రియను డీఎంకే పార్టీ నామినేట్ చేసింది. చెన్నై కార్పొరేషన్‌లో డీఎంకే మెజారిటీ సాధించింది కాబట్టి త్వరలో మేయర్‌గా ప్రియ అధికారికంగా ఎన్నిక కానున్నారు. చెన్నైలో మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి దళితురాలు, అతి పిన్న వయస్కురాలు కూడా ఆమె కావడం విశేషం. చెన్నై చరిత్రలో తారా చెరియన్ & కామాక్షి జయరామన్ తర్వాత ఈ పదవిని చేపట్టిన మూడో మహిళ కూడా ప్రియగా రికార్డు నెలకొల్పనున్నారు. ఉత్తర చెన్నైలోని తిరు వికానగర్‌కు చెందిన ఆర్ ప్రియ, టీఎన్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు నంబర్ 74 నుండి గెలుపొందారు.

గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌తో సహా మొత్తం 21 మున్సిపల్ కార్పొరేషన్లలో డీఎంకే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. 138 మున్సిపాలిటీలు, 490 పట్టణ పంచాయతీలు.కార్పొరేషన్లలో 952, మున్సిపాలిటీల్లో 2,360, పట్టణ పంచాయతీల్లో 4,389 వార్డులను డీఎంకే గెలుచుకుంది. ఇందులో మాజీ ముఖ్యమంత్రులు కె. పళనిస్వామి (ఎడప్పాడి, సేలం జిల్లా), ఓ పన్నీర్‌సెల్వం (పెరియకులం, తేని జిల్లా) సహా అన్నాడీఎంకే నేతల సొంత నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement