Thursday, April 25, 2024

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో 8మందికి రిమాండ్‌కు

తెలంగాణ రాష్ట్ర‌ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈకేసుకు సంబంధించి 8 మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితులను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు మేడ్చల్ కోర్టు కస్టడీ పిటిషన్‌పై విచారణ జరపనుంది. నిందితులను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కుట్రతో సంబంధం ఉన్న 8 మంది.. రాఘవేంద్రరాజు, మధుసూదన్‌రాజు, మున్నూర్‌ రవి, అమరేందర్‌ రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌, తాపాను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement