Saturday, May 4, 2024

Maurition: మారిషస్‌ ప్రధాని నోట జై హింద్‌…అయోధ్యకు తిరిగి రాముడోస్తున్నందుకు సంతోషిద్దాం…

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలను యావత్‌ దేశంతో పాటు మారిషస్‌లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మారిషస్‌ ప్రధానమంత్రి ప్రవింద్‌ కుమార్‌ జగన్నాథ్‌ ప్రత్యేక సందేశం ఇచ్చారు.

శ్రీరాముడు అయోధ్యకు తిరిగొస్తున్న వేళ మనమంతా సంతోషిద్దాం. మన మార్గంపై వెలుగులు ప్రసరింపజేసి శాంతి, శ్రేయస్సు వైపు అడుగులు వేసేలా ఆయన బోధనలు, ఆశీస్సులు కొనసాగాలని ప్రార్థిద్దాం. జై హింద్‌” అని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. మారిషస్‌ ప్రజలంతా ఐక్యంగా ఈ ఆధ్వాత్మిక వేడుకను నిర్వహించుకోవడానికి సిద్ధమయ్యారని చెప్పారు. దేశంలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించనున్నట్లు తెలిపారు. మందిరాలన్నీ రామనామ జపంతో మార్మోగనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుక కేవలం భారతీయులకేగాక మారిషస్‌ ప్రజలకూ చాలా ప్రత్యేకమని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement