Tuesday, May 21, 2024

PBKS vs LSG | లక్నోతో మ్యాచ్​.. పంజాబ్​కి ఈజీ టార్గెట్​

డబుల్ హెడర్ లో భాగంగా శనివారం జరుగుతున్న రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 55 బంతుల్లో 74 పరుగులు చేసి అర్ధ సెంచరీతో రాణించాడు. అర్ధ సెంచరీ చేసినా స్ట్రయిక్ రేట్ విషయంలో మాత్రం కేఎల్ రాహుల్ చాలా వెనుకపడ్డాడు. ఓపెనర్ గా వచ్చి ఆఖరి వరకు ఉన్నా.. కనీసం 140 స్ట్రయిక్ రేట్ ను కూడా అందుకోలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో స్యామ్ కరణ్ 3 వికెట్లతో మెరిశాడు. కగిసో రబడకు 2 వికెట్లు లభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement